కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై రాజేష్ అనే వ్యక్తి ఈ కథ నాదే అని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆరోపణలపై చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా అతను చెప్పిన కథ నచ్చలేదు కాబట్టే మేము ఆ సినిమాను చేయలేదని వారు వివరణ ఇచ్చారు. దానికి.. దీనికి సంబంధం లేదని అన్నారు. ఇక ఇప్పుడు ఈవార్తలపై కొరటాల కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఆచార్య’ స్టోరీ మీది కాదు. మీ కథ వేరు. నా కథ వేరు. నేను ఈ కథని ఎప్పుడో రిజిస్టర్ చేయించాను. ఇప్పుడు కథ మార్చమంటే ఎలా మారుస్తాను. నా కథతో నేను సినిమా తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న కథతో మీరు సినిమా చేసుకోండి. ఇప్పుడు మీకు కథ చెప్పమంటే నేను ఎలా చెబుతాను. సెట్పై సినిమా ఉంటే నేను కథను ఎలా రివీల్ చేస్తాను. తప్పుడు ఆరోపణలు చేయడం ఆపండి. లేకపోతే నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నేను అవసరమైతే కోర్టుకు వెళ్తాను. ఆరోపణలు చేసే వారందరికీ నేను నా సినిమా కథ వినిపించుకుంటూ పోవాలా.. ఇది బ్లేమ్ గేమ్’’ అని కొరటాల హెచ్చరించారు. మరి ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందో లేక ఇంకా ముందుకు పోతుందో చూద్దాం ఏం జరుగుతుందో.
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: