వేటినైనా ఆపడం కష్టం కానీ రూమర్స్ ను ఆపడం మాత్రం చాలా కష్టం. అది కూడా సినిమా పరిశ్రమలో అయితే ఇంకా కష్టం. ఏదైనా సినిమా వస్తుందంటే అది రిలీజ్ అయ్యేంత వరకూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.. ఇక ఆ రూమర్స్ ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే వుంటారు చిత్రయూనిట్ కూడా. ఇప్పుడు నాంది టీం కూడా అదే పనిలో పడింది. తాజాగా ఈ సినిమాపై కూడా ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆ సినిమా షూటింగ్ ఆపడంపై. అసలు సంగతేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఇక కరోనా వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ మూడు రోజుల పాటు షూటింగ్ జరిపారు. అయితే రెండు మూడు రోజుల నుండి వర్షం రావడంతో చిత్రీకరణ నిలిపివేశారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో యూనిట్ మెంబర్స్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో షూటింగ్ నిలిపి వేశారంటూ వార్తలు బయటకొచ్చాయి.
ఇక ఈ వార్తలపై స్పందించిన నరేష్ క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ నిలిపేయడానికి కరోనా కారణం కాదని.. దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయొద్దని.. వాటిని నమ్మొద్దని… వర్షం వల్లే చిత్రీకరణను ఆపాం తప్ప, వేరే కారణంతో కాదని స్పష్టం చేసారు నరేష్. మరోవైపు సతీష్ వేగేశ్న కూడా ఈ వార్తలపై స్పందించి వాటిని కొట్టేసారు.
ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: