కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో.. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే కోలుకుంటానని అభిమానులకు తానే స్వయంగా వీడియో ద్వారా సమాచారాన్ని అందించారు కూడా. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని.. నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇక దీనితో టాలీవుడ్ సినీ ప్రముఖులు బాలు తొందరగా కోలుకోవాలని అందరూ ట్వీట్లు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని చైన్నై ఎంజీఎం వైద్యులు తాజా బులిటెన్ లో ప్రకటించారు. మరోవైపు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించి… ఎస్పీ బాలు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వదంతులను నమ్మొద్దని కోరారు. ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారని తెలిపారు.
ఇదిలా ఉండగా ఎస్పీ బాలు సతీమణి సావిత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె కూడా చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా బాగానే ఉందని.. కోలుకుంటుందని తెలిపారు చరణ్. ఇక బాలు ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్న అభిమానులకు చరణ్ ధన్యవాదాలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: