ఒకే క్యారెక్టర్ తో మలయాళ మూవీ

An Experimental Malayalam Movie With Only One Character To Hit The Floors Soon

ప్రయోగాత్మక మూవీస్ కు మలయాళ చిత్రపరిశ్రమ పెద్ద పీట వేస్తుందని తెలిసిన విషయమే. ఇప్పుడు ఒకే ఒక్క పాత్రతో ఒక మలయాళ మూవీ రూపొందుతుంది. డ్రీమ్ బిగ్ అమిగోస్ బ్యానర్ పై మిథున జ్యోతి దర్శకత్వంలో AK విజుబల్ ప్రధాన పాత్రలో థ్రిల్లర్ “18 +” మలయాళ మూవీ రూపొందుతుంది. 15 మంది టీమ్ మెంబర్స్ తో త్రివేండ్రం లోని ఒక లొకేషన్ లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“18 +” మలయాళ మూవీ సెప్టెంబర్ 4వ తేదీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ కి పనిచేసే టీమ్ మెంబర్స్ అందరికీ 20 సంవత్సరాల వయసు ఉండడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమ లో ఈ తరహా మూవీ రూపొందడం మొదటిసారి. ఈ ప్రయోగాత్మక మూవీ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మందార పూల మధ్య ఉన్న యువతి పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.తమిళ చిత్ర నటుడు, ద‌ర్శ‌కుడు ఆర్ పార్దీప‌న్ కేవ‌లం ఒకే ఒక్క పాత్ర‌తో సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. “ఒథ సెరుప్పు” టైటిల్ తో తీసిన ఈ త‌మిళచిత్రంలో పార్థీప‌న్ నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =