‘సైరా’ తరువాత సురేందర్ రెడ్డి ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే గత కొన్ని రోజులుగా సురేందర్ రెడ్డి – అఖిల్ కాంబో గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఖాయం అయిపోయినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ కథను నాగార్జునకు, అఖిల్కు సురేందర్ రెడ్డి వినిపించారట. ఇక కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు అఖిల్ కోసం మంచి ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ లో ఉండే కథను సిద్ధం చేశాడట సురేందర్ రెడ్డి. అఖిల్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా నుండి క్వారెంటైన్ పోస్టర్ పేరుతో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అఖిల్ ను టీజ్ చేస్తూ వుండే ఈ పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది. నిజానికి ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడింది. అన్నీ సెట్ అయితే 2021 జనవరి లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. మరి చూద్దాం అప్పటికి పరిస్థితులు ఏమన్నా మారుతాయేమో.
అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందో లేదో చూద్దాం..!
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: