బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ లో కియారా హీరోయిన్ గా నటించారు. రికార్డ్ కలెక్షన్స్ తో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. కియారా హీరోయిన్ గా నటించిన “లక్ష్మీ బాంబ్ “, “ఇందూ కి జవానీ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన “షేర్ షా ” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “భూల్ భులాయ్యా 2 “మూవీ చిత్రీకరణలో ఉంది. కియారా హీరోయిన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. కియారా త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. కియారా ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో అతిథి పాత్రలో నటించారు. సోనమ్ నాయర్ దర్శకత్వంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా జీవిత చరిత్ర ఆధారంగా “మసాబా మసాబా ” హిందీ వెబ్ సిరీస్ రూపొందుతుంది. మసాబా స్టోర్ కు వెళ్ళి ఒక డ్రెస్ కొనుగోలు చేసే సన్నివేశంలో కియారా నటించారు. నిర్మాత అశ్వని కోరికపై ఆ సీన్ లో నటించానని కియారా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: