ఆర్ఎక్స్ 100 అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ఈ రోజు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. కరోనా వచ్చేసింది.. త్వరలోనే వస్తా.. ప్లాస్మా ఇస్తా అని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈరోజు అజయ్ భూపతి పుట్టినరోజు కూడా. ఇక ఈ సందర్భంగా కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా అజయ్ కు కరోనా వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా స్పందించాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదామంటే కరోనా గురించి ట్వీట్ చేసేలా చేశారేంటి సర్. ఇందులో కూడా పాత్ బ్రేకింగ్ ఉన్నారు మీరు. ఏం పర్లేదు సర్.. కరోనాని ఆర్ఎక్స్ 100 తో తొక్కేసి వచ్చేయండి…హ్యాపీ బర్త్ డే సర్.. ఫాస్ట్ గా రికవర్ అయిపోండి.. త్వరలోనే కలుద్దాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy birthday tweet chedam ankunte..corona gurinchi tweet chesela chesarenti sir..Indulo kuda path breaking unnaru meeru ..Em parledu sir corona ni RX100 tho thokkesi ocheyandi..Happy birthday @DirAjayBhupathi sir..fast fast ga recover aipondi.See you soon😘 https://t.co/bCb4Y2rqAU
— Kartikeya Gummakonda (@ActorKartikeya) August 13, 2020
`ఆర్ ఎక్స్ 100` తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తికేయ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు. గత ఏడాది ఏకంగా నాలుగు చిత్రాలు హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ML తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కాగా కార్తికేయ ప్రస్తుతం ‘చావు కబురు చల్లగా’ లో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతలుగా.. కౌశిక్.పి- సునీల్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో బస్తీ బాలరాజుగా కార్తికేయ నటిస్తున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: