వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మాతగా . ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా ‘అ’. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, రెజీనా ప్రధాన పాత్రల్లో 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఓ కొత్త సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. పలు అవార్డులను సైతం దక్కించుకుంది ఈ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తున్నట్టు గతకొద్దికాలంగా వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ త్వరలోనే ‘అ 2’ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలిపాడు. ‘అ 2’ ను హిందీలో తీయడానికి చాలా ఆఫర్స్ వచ్చాయి అంతెందుకు ‘అ’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి చాలా మంది ఆఫర్ చేశారు. కానీ ఫస్ట్ ‘అ’ తెలుగులోనే తీయాలని నా ఆలోచన.. జొంబీ రెడ్డి సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాం అని తెలిపారు.
కాగా ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జోంబీ రెడ్డి సినిమాతో బిజీగా వున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ జోంబీ రెడ్డి సినిమాకు రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంచుకునే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూద్దాం.
సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ’ సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్తో చేసి ఆకర్షించారు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: