టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త కొత్త కాంబినేషన్స్ లో మూవీస్ సెట్ అవుతున్నాయి. డైరెక్టర్స హీరోలకు తగినట్టు కొత్త కొత్త కథలను రాస్తున్నారు.. హీరోలు కూడా ఒకే జోనర్ కు ఫిక్స్ అవ్వకుండా కొత్త కొత్త ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆహీరో-డైరెక్టర్ ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ-మారుతి. వీరిద్దరూ కలిసి త్వరలో సినిమా చేయబోతున్నట్టు టాక్స్ నడుస్తున్నాయి. ఇటీవలే మారుతి హీరో రవితేజకు కథ వినిపించారని, రవితేజ కూడా ఓకే చేశారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? .. హీరోయిన్ ఎవరు? వంటి వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మారుతి… రవితేజ నేను ఎప్పటినుండో సినిమా తీయాలనుకుంటున్నాం.. ఎప్పుడూ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఇంత వరకూ తెయలేకపోయాం…ఎక్కడికి వెళ్లిన ఫస్ట్ రవితేజ గారితో సినిమా ఎప్పుడు అనే అడుగుతున్నారు.. త్వరలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని తెలిపాడు. దీనితో మారుతి మాటలవల్ల వీరిద్దరి సినిమా పక్కా ఉండబోతుందన్న విషయం అయితే అర్ధమవుతుంది. మరి ఎప్పుడు అనేది తెలియాలంటే వేచి ఉండాల్సిందే.
ఇక రీసెంట్గా సాయి ధరమ్ తేజ్కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించాడు మారుతి. ఇక రవితేజ ప్రస్తుతం `క్రాక్` చిత్రంలో నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: