జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే టాలీవుడ్ కి ప్రస్తుతం బ్యాడ్ డేస్ నడుస్తున్నట్టే తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది మృత్యు వాత పట్టారు. ఇక పలువురు సినీ ప్రముఖులకు కరోనా కూడా వచ్చి పడింది. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో కమెడియన్ కూడా అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. అతనెవరో కాదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరుపొందిన పృథ్వీరాజ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘గత కొన్నిరోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాను. రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ నెగిటివ్ వచ్చిందని. కొంత మందికి లక్షణాలు ఉన్నప్పటికీ కరోనా నెగిటివ్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారని తెలిపారు. జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు క్వారంటైన్లో చేరానన్నారు. వెయిటింగ్ ఫర్ గుడ్ హెల్త్. మీ అందరి ఆశీస్సులు.. ఆ వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీరాజ్ అంటూ తెలిపారు. దీనితో ప్రతి ఒక్కరు పృథ్వీ రాజ్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: