తెలుగు , తమిళ, హిందీ భాషల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ తమన్నా లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , కుకింగ్, వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , మాతృభాష నేర్చుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్న తమన్నా ఇప్పుడు మరో కొత్త అభిరుచికి తెర తీశారు. ట్రెక్కింగ్ బాట పట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహారాష్ట్ర థానే లో ఉన్న పాప్యులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ అసంగావ్ మహులి ఫోర్ట్ ను తమన్నా సందర్శించారు. అటవీ ప్రాంతం లో ఉన్న పోర్ట్ పరిసర ప్రాంతాలలో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కాలినడకనఫోర్ట్ కు చేరుకున్నారు. అటవీ ప్రాంతం లో ట్రెక్కింగ్ చేస్తున్న తన ఫోటోను తమన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, “బోలే చూడియన్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: