మహానటి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. అందులో మిస్ ఇండియా సినిమా కూడా ఒకటి. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అందులో భాగంగా ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. తన ట్విట్టర్ లో ఒక ఫొటో షేర్ చేస్తూ స్టార్ బక్స్ కాఫీతో మిస్ ఇండియా బీజీయం వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Some @Starbucks coffee & #missindiabgm works ✨▶️🎵🎹♥️ pic.twitter.com/gV8qGoydJk
— thaman S (@MusicThaman) July 14, 2020
నరేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను… ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కొనేరు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ మూవీ లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ఓ సినిమా చేస్తుంది. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: