సూపర్స్టార్ మహేశ్ లాక్డౌన్ సమయంలో పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా పుస్తకాలు కూడా చదువుతూ కాలక్షేపం చేస్తున్నాడు. మొన్నామధ్య ‘ఎమోషనల్ ఇంటెలిజన్స్’ పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. ‘ఎమోషనల్ ఇంటెలిజన్స్.. సైంటిఫిక్ .. సంచలనాత్మకం.. అందరూ చదవాల్సిన పుస్తకం. ఇక ఈ వారం అంతా డానియల్ గోల్ మెన్ కే కేటాయిస్తున్నా..’ అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ చూడమని చెపుతున్నాడు. ‘డార్క్’ అనే పేరుతో తెరకెక్కిన జర్మన్ వెబ్ సిరీస్ను చూశానని, రచన, దాన్ని తీసిన తీరు అత్యద్భుతంగా ఉన్నాయని మహేశ్ తెలిపారు. అంతే కాకుండా ఈ జర్మన్ వెబ్ సిరీస్ను చూడాలంటూ తను రెకమండ్ కూడా చేస్తున్నానని తెలిపారు మహేశ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్.
ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: