వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో అజిత్ కుమార్ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ప్రస్తుతం “వాలిమై ” మూవీ లో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డ్రోన్ టీమ్ “దక్ష” కు అజిత్ సలహాదారు గా ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు దక్ష టీమ్ డ్రోన్స్ ద్వారా పలు ప్రాంతాలను క్రిమి సంహారక మందు ను స్ప్రే చేస్తూ శానిటైజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దక్ష టీమ్ తో అజిత్ తమిళనాడు ప్రభుత్వానికి సహాయ పడుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సిఎమ్ అశ్వత్ నారాయణన్ , అజిత్ &టీమ్ ప్రయత్నాలకు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. అజిత్ సలహాదారు గా ఉన్న దక్ష టీమ్ కు అభినందనలు అని , కరోనా వ్యాప్తి నివారణకు అనేక ప్రాంతాలను డ్రోన్స్ ద్వారా శానిటైజ్ చేసే విధంగా ఒక దారి చూపారని ట్వీట్ చేశారు. వ్యవసాయానికి , నిఘా కు ఉపయోగించే డ్రోన్స్ తో క్రిమి సంహారక మందును స్ప్రే చేయడానికి దక్ష టీమ్ తమిళనాడు ప్రభుత్వంతో చేతులుకలిపింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: