సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన జీవిత విశేషాలను రష్మిక అభిమానులతో పంచుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఫోటో షూట్ లో బ్లూ శారీ తో పాల్గొన్న రష్మిక ఆ ఫొటోలతో పాటు ఒక చిన్న కథ ను రాసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదొక మహల్ , పేరు అగ్ని మహల్. ఆ మహల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి . ప్రతి రోజూ మైరా ఆ మహల్ మెట్ల పై కూర్చొని తన కోరిక నెరవేరే క్షణాలకోసం నిరీక్షిస్తూ ఉంటుంది. మహల్ పనివాళ్ళు తమ రోజు వారీ పనులు చేసుకుంటూ ఉంటారు. నిత్యమూ నీలిరంగు చీర తో కనపడే మైరా పనివారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. మైరా రూప లావణ్యం వెనుక దాగిన హృదయ వేదన వెలుగులు విరజిమ్మే సూర్య కాంతికి భిన్నంగా ఉంది. తన నిరీక్షణ ఫలించే రోజు వచ్చిందని మైరా హృదయం ఆరాటపడుతుంది. తనలోని భావాలను రష్మిక ఒక కథ గా రాసి షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: