సెలెబ్రిటీస్ పై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటది. ఇక ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై అయితే వాళ్ళకి తెలియని వాళ్ళతో కూడా ముడిపెట్టి వార్తలు రాసేస్తుంటారు. వాళ్ళు అలాంటిది ఏంలేదని చెప్పినా కూడా ఆ వార్తలు మాత్రం ఆగవు. ఇప్పుడు హీరోయిన్ రాశీఖన్నా పరిస్థితి కూడా అలానే వుంది. ఈ భామ పై కూడా ఈ మధ్య కాలంలో పలానా వ్యక్తితో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేను ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ రూమర్సే అని ఆమె క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన జీవితంలో ఇప్పటి వరకు “మిస్టర్ పర్ఫెక్ట్” ఎవరూ లేరని.. తనకు కాబోయే వాడి విషయంలో ఎటువంటి కోరికలు తనకు లేవని ఆమె తెలిపారు. అలాగే చూడగానే ప్రేమించడం, ప్రేమలో పడటం అనే వాటిని కూడా తను నమ్మనని తెలిపారు. ప్రస్తుతం తన ధ్యాసంతా కెరీర్పై మాత్రమే ఉందని, సినిమాలు కాకుండా ఆధ్యాత్మికత, పుస్తకాలతోనే తన జీవితం ప్రస్తుతానికి ముడిపడి ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం తన మనసుకు నచ్చేవాడి గురించి ఆలోచించేంత టైమ్ తనకి లేదని అన్నారు. దయచేసి ఇటువంటి రూమర్లు పుట్టించవద్దని ఆమె తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరి ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా ఈ రూమర్స్ ఆగుతాయో లేదో చూద్దాం.
ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో వుంది. ప్రస్తుతం రాశీఖన్నా తమిళంలో మూడు సినిమాలతో బిజీ గా ఉంది. సుందర్ సి దర్శకత్వంలో ‘అరణ్మనై-3’తో పాటు సూర్య ‘అరువా’ చిత్రంలోనటిస్తున్నారు. అలాగే మేధావి చిత్రంలో జీవాకు జంటగా నటిస్తున్నారు. అంతేకాదు లాక్ డౌన్ లో తమిళం కూడా నేర్చుకుంటుందట ఈ అమ్మడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: