ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. కరణం మల్లీశ్వరి బయోపిక్ ను రూపొందనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ప్రకటన చేశారు. ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ..కోన ఫిలిం కార్పొరేషన్ తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సినిమాకు ‘రాజుగాడు’తో మంచి పేరు తెచ్చుకున్న దర్శకురాలు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఓ మారుమూల పల్లె నుంచి సిడ్నీ ఒలింపిక్స్లో పతకం గెలిచే వరకు ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది అన్న విషయాలు బయోపిక్లో చూపించనున్నారు. అయితే సినిమాలో సినిమాలో కరణం మల్లీశ్వరి గా కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం తెలియదు. త్వరలోనే ఈ సినిమా వివరాలు తెలియచేయనున్నారు.
On her birthday today, we proudly announce our next, a biopic on @kmmalleswari, FIRST Indian woman to win a medal at Olympics. A multilingual PAN Indian movie! #HBDKarnamMalleswari
🖋️ by @konavenkat99
🎬 by @sanjanareddyd
💰 by @MVVCinema_ & @KonaFilmCorp.#MVVSatyanarayana pic.twitter.com/W2qsBft9iL— KonaFilmCorporation (@KonaFilmCorp) June 1, 2020
కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్ట్ విభాగంలో భారత్కు తొలి పతకం సాధించిన తొలి భారతీయ మహిళ. ప్రముఖ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్రత్న, పద్మశ్రీని అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: