వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ #Prabhas 21 రూపొందనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ లో హీరో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే ను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “ఓం శాంతి ఓం “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దీపిక పడుకొనే “హౌస్ ఫుల్ “, “రేస్ 2”, “చెన్నై ఎక్స్ ప్రెస్ “, “భాజీరావ్ మస్తానీ “, “పద్మావత్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన దీపిక ముంబై లోని తన ఇంటి లో సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. రీసెంట్ గా “మహానటి ” మూవీ చూసిన దీపిక, దర్శకుడు నాగ్ అశ్విన్ మేకింగ్ స్టైల్ , డైరెక్షన్ స్కిల్స్ కు ఇంప్రెస్ అయ్యి , తన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ను ఆ మూవీ చూడాల్సిందిగా దీపిక కోరారు. బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న ప్రభాస్ కు దీపిక జోడీగా నటిస్తే ఆమూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: