లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇప్పుడిప్పుడే ప్రజలు కాస్త రోడ్లపై తిరుగుతున్నారు. ఇక ఈ సమయంలో కొందరు దర్శకులు కరోనాపై సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కరోనాపై రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా చేరిపోయాడు ఆ జాబితాలో. నిజానికి కరోనా వచ్చిన మొదట్లోనే దీనిపై సినిమా తీయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అప్పటినుండి ఎలాంటి అప్ డేట్ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమా తీయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. ‘కరోనా వ్యాక్సిన్’ అనే టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. టైటిల్ని బట్టి చూస్తే కరోనా వైరస్కి మందు కనుగొన్నట్టు ఈ సినిమాలో చూపిస్తారని ఊహించవచ్చు.
ఇక ఈ రోజు ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్బంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలపై కరోనా ప్రభావంఉంటుందనేది సింపుల్గా వీడియోలో చూపించారు. ఇందులో నటించబోయే నటీ నటులు ఎవరు? ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు? వంటి విషయాలు అయితే ప్రస్తుతానికి తెలియదు. అతి త్వరలో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ‘అ!, కల్కి’ చిత్రాలతో ఆకట్టుకున్నప్రశాంత్ వర్మ…మూడో సినిమా కోసం కరోనా వైరస్ బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.
New film.. new genre! Hope u all like it. 😊
Motion Poster 👉https://t.co/CoFTDa0te0#PV3 #VaccineVasthundi pic.twitter.com/3fVUwg0Gap
— Prasanth Varma 4.0 (@PrasanthVarma) May 29, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: