గత ఏడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేశాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు పూరి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ సినిమా సెట్స్పై ఉండగానే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్తో ఓ మూవీ చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట ఈ డాషింగ్ డైరెక్టర్. ఇప్పటికే సల్మాన్కు కథ వినిపించడం జరిగిందని, సల్మాన్కి కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బీటౌన్ టాక్. ఈ నేపథ్యంలో.. స్క్రిప్ట్ని ఫైన్ ట్యూన్ చేసే పనిలో ఉన్నాడట పూరి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. త్వరలోనే పూరి, సల్మాన్ కాంబో మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం.. సల్మాన్ ఖాన్ చేతిలో ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి’, ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రాలు ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: