వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా రూపొందిన “బాహుబలి” ,”బాహుబలి 2″ , “సాహో ” మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. ఈ మూవీస్ తో బాలీవుడ్ లో ప్రభాస్ మూవీస్ పై క్రేజ్ పెరిగింది. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ తో రూపొందనున్న #Prabhas 21 మూవీ పై బాలీవుడ్ లో ఫోకస్ పెరిగింది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను కథానాయిక గా ఎంపిక చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమా నిర్మాణం లో పాలు పంచుకొనడానికి ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: