టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక ఆలోచన రేకెత్తించే ఒక పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా లాక్ డౌన్ సమయంలో మెంటల్ హెల్త్, వర్క్ , హార్ట్, ఫిజికల్ ఫిట్ నెస్ వంటి విషయాలలో అభద్రతా భావన ఫీలింగ్ తనకు కలిగిందని , లాక్ డౌన్ సమయం లో ప్రతీ ఒక్కరూ కామ్ గా , కంట్రోల్ గా ఉండమని , మంచి పనులు చేయమని రష్మిక కోరారు. జీవితం లో అభద్రతా భావం తో ఉండకూడదని, ప్రతీ ఒక్కరూ తమ విలువ ను తెలుసుకోవాలని, పరిస్థితులు ఎల్లప్పుడూ మన కంట్రోల్ లో ఉండవని , ఎక్కువగా ఆలోచించవద్దని, పరిస్థితులను కంట్రోల్ చేసుకొనడం మన చేతుల్లోనే ఉందని , అభద్రతా భావం ఎప్పుడూ ఉంటుందని, ఇతరుల అభిప్రాయం, కామెంట్స్ మన మీద ప్రభావం చూపకూడదని , మనం మన యొక్క విలువను తెలుసుకోవాలని రష్మిక పోస్ట్ చేశారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్ వాయిదా పడింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: