మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. నిజానికి ఈ సినిమా ఈ నెల మొదటి వారంలో రిలీజ్ కావాల్సి వుంది కానీ లాక్ డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహారాజా రవితేజ హీరోగా ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నట్టు ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారని తెలిపారు. లాక్డౌన్ ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే గ్రాండ్గా సినిమాని లాంచ్ చేస్తామని… ఏ మధ్యలో ఎలాంటి రూమర్స్ వచ్చినా వాటిని నమ్మొద్దని ఆయన తెలిపారు.
కాగా ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా కోసం పేరుపొందిన టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. నటీ నటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: