లాక్ డౌన్ లో మొత్తానికి ఇంట్లో మంచిగా కాలక్షేపం చేస్తున్నారు మెగా స్టార్ చిరంజీవి. అంతేకాదు సోషల్ మీడియాకు దగ్గరగా వుంటూ అపుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తున్నారు. దానితో పలు సరదా వీడియోలు, ఫొటో లు కూడా పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా త్రో బ్యాక్ ఫొటో ను పోస్ట్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 1990లో అమెరికా వెళ్లినపుడు అక్కడ వంట చేస్తున్న ఫొటోను.. ప్రస్తుతం సొంతింట్లో వంట చేస్తున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. ఫొటో ను పోస్ట్ చేస్తూ.. కాలం మారినా.. దేశం మారినా.. తాను..నేను మాత్రం ఏమీ మారలేదని కాప్షన్ కూడా పెట్టారు. ఆ రెండు ఫొటోలో చిరు-సురేఖ ఒకే రంగు బట్టలు వేసుకొని.. ఒకే స్టైల్ లో నిల్చొని ఉన్నారు. ఇక మొదటి ఫొటోకు జాయ్ ఫుల్ హాలీడే అని క్యాప్షన్ అని పెట్టగా.. రెండో ఫొటోకు ‘జైల్ ఫుల్ హాలిడే ఇన్ కరోనా 2020’అని క్యాప్షన్ అని పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిరంజీవి వరుస సినిమాలని లైన్లో పెట్టారు. ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కొంత షూట్ జరగగా.. కరోనా వల్ల షూట్ కు వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. దీనితో పాటు.. ఈ సినిమా తర్వాత బాబీ, మెహర్ రమేష్ వంటి యంగ్ డైరెక్టర్స్తో పలు ప్రాజెక్టులు చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: