‘భరత్ అనే నేను’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది కియారా అద్వానీ. అందులో ‘వసుమతి’ పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా.. తన అభినయంతో, అందంతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. ఆ తరువాత ‘వినయ విధేయ రామ’లోనూ సందడి చేసిన కియారా.. ప్రస్తుతం తన దృష్టంతా హిందీ చిత్రాలపైనే కేంద్రీకరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ సినిమా ఏంటో చెప్పుకొచ్చింది కియారా అద్వానీ. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. 2001లో విడుదలై సంచలన విజయం సాధించిన కుటుంబ కథా చిత్రం ‘కభీ ఖుషి కభీ ఘమ్’. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, షారుక్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాని లెక్కకు మించిన సార్లు చూశానని.. అదే తన ఫేవరెట్ మూవీ అని తెలిపింది కియారా.
మరి.. ‘కభీ ఖుషి కభీ ఘమ్’ లాంటి ఫ్యామిలీ డ్రామాలో కియారా ఎప్పుడు నటిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: