మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిది సక్సెస్ఫుల్ కాంబినేషన్. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’(2013).. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు చిత్రాలు విజయపథంలో పయనించాయి. కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత రవితేజ, గోపీచంద్ కలయికలో మూడో సినిమా వస్తోంది. ఆ చిత్రమే.. ‘క్రాక్’. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా దర్శనమివ్వనున్నాడు రవితేజ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి దాదాపు చిత్రీకరణ పూర్తయింది. కేవలం ఒకే ఒక్క సన్నివేశం మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాన్ని లాక్ డౌన్ పిరియడ్ అనంతరం షూట్ చేయబోతున్నారని వినికిడి. కాగా, తొలుత ఈ సినిమాని మే 8న విడుదల చేయాలనుకున్నారు. కరోనా ఎఫెక్ట్తో వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు లేదా అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారని తెలిసింది.
శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ‘క్రాక్’కి థమన్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: