ఆచార్య కొరటాల శివ-చిరు కాంబినేషన్ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే మొదట ఈ సినిమా కోసం త్రిష ను తీసుకోగా.. కొన్ని కారణాల తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే త్రిష స్థానంలో కాజల్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. త్రిష తప్పుకోవడంపై పలు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో తప్పుకుందని చిరు క్లారిటీ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి త్రిషకు చిరు మరో ఛాన్స్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆచార్య తర్వాత చిరు సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్తో చేయనున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ‘వేదాళం’ రీమేక్లోనూ నటించబోతున్నారు. ఈ రెండు ఈ సినిమాల్లో ఏదో ఓ దాంట్లో త్రిషను తీసుకోవాలని చూస్తున్నారట. మరి ఏ సినిమాలో నటిస్తుందో క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: