మొత్తానికి రెండుసార్లు వాయిదా పడిన అనంతరం టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వివాహం జరిగింది. నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ ల వివాహం ఈ రోజు నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఈ ఉదయం 6.31 గంటలకు వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు…కొద్ది మంది బంధువులు, మిత్రులు మాత్రమే ఈ పెళ్లి హాజరయ్యారు. కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మకు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో కొందరు సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మొదట ఏప్రిల్ 16న వివాహం జరపాలని భావించారు. ఈలోగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పెళ్లిని వాయిదా వేశారు. అయితే, ఈ నెలాఖరు తరువాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో తొందరగా పెళ్లి ఫిక్స్ చేసేశారు కుటుంసభ్యులు.
కాగా కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభినచాలనుకునేలోపు కరోనా వల్ల అది కూడా జరగలేదు. అయితే ఇంట్లో ఉంటూనే మ్యూజిక్.. పలు పనులను కానిచ్చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: