‘గబ్బర్ సింగ్’ (2012) వంటి బ్లాక్బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని నిర్మించనుంది. కాగా, ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్, హరీష్, దేవిశ్రీ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’.. నిన్నటితో(మే 11) ఎనిమిదేళ్ళను పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘పవన్ కళ్యాణ్ 28’కి కూడా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడని హరీష్ ట్వీట్ చేశాడు.
మరి.. ‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్, హరీష్, దేవిశ్రీ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా కూడా మ్యూజికల్ బ్లాక్బస్టర్ అవుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: