‘పవన్ 28’కి దేవిశ్రీప్రసాద్ స్వరాలు

Rockstar Devi Sri Prasad To Score Music For PSPK 28

‘గబ్బర్ సింగ్’ (2012) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుంది. కాగా, ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్, హరీష్, దేవిశ్రీ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’.. నిన్నటితో(మే 11) ఎనిమిదేళ్ళ‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘పవన్ కళ్యాణ్ 28’కి కూడా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడని హరీష్ ట్వీట్ చేశాడు.

మరి.. ‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్, హరీష్, దేవిశ్రీ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమా కూడా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =