సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జక్కన్న మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. మహేష్, రాజమౌళికి వేర్వేరు సంవత్సరాల్లో ఇండస్ట్రీ హిట్స్ను అందించిన ఏప్రిల్ 28న (2021) ఈ భారీ బడ్జెట్ మూవీకి ముహూర్తం ఫిక్స్ చేసారని వినికిడి. 2006లో ఇదే తేదీన మహేష్ ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ రిలీజ్ కాగా, రాజమౌళి ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ ‘బాహుబలి 2: ది కంక్లూజన్’(2017) కూడా అదే తేదీన విడుదలైంది. ఈ నేపథ్యంలో మహేష్, జక్కన్న కాంబినేషన్ మూవీ అదే రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరి.. మహేష్, రాజమౌళికి వేర్వేరు సందర్భాల్లో ఇండస్ట్రీ హిట్స్ని అందించిన ‘ఏప్రిల్ 28’కి ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఆ ఇద్దరి ఫస్ట్ కాంబో ఫిల్మ్ కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
త్వరలోనే మహేష్, జక్కన్న కాంబినేషన్ మూవీ ముహూర్తం తేదీపై క్లారిటీ రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: