యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్లో మెమరబుల్ మూవీగా నిలిచిన చిత్రాల్లో ‘బృందావనం’ ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ సరికొత్తగా దర్శనమిచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్.. అప్పట్లో మంచి విజయం సాధించింది. అంతేకాదు.. పలు భాషల్లో రీమేక్ అయింది కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జరుగుతోందని సమాచారం. ప్రస్తుతం వంశీ స్క్రిప్ట్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారని.. లాక్డౌన్ పిరియడ్ అనంతరం ఈ సీక్వెల్పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్ఫర్మేషన్.
మరి.. ‘బృందావనం’ సీక్వెల్లో తారక్, కాజల్ అగర్వాల్, సమంత త్రయం.. మరోసారి సందడి చేస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























