టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయాన్ని సినీ తారలు ఎంజాయ్ చేస్తూ, సోషల్ మీడియా లో వీడియోలు పోస్ట్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రాశీఖన్నా తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో బుక్స్ చదువుతూ, ప్రేరణ కలిగించే వీడియో లు చూస్తున్నానని, తాను నవ్వుతూ, ఆనందం గా ఉండటానికి తన కుటుంబం, స్నేహితులు, అభిమానుల ప్రేమ, ఆప్యాయతలే కారణం అని, తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అని, అల్లు అర్జున్ తో జోడీగా నటించడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నానని, తెలుగు ప్రేక్షకులు తన ప్రాణం అని, ప్రేమ వివాహానికే తన ఓటు అని రాశీఖన్నా చెప్పారు. స్టార్ హీరో సూర్య హీరో గా రూపొందనున్న తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యానని, కొన్ని తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయని రాశీఖన్నా తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: