రానా దగ్గుబాటి, సాయి పల్లవి నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాలో ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డు గ్రహీత ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు.. ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘విరాట పర్వం’ షూటింగ్ వివరాలు తెలియజేశారు. కేవలం ఏడెనిమిది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ఆయన చెప్పారు. కాగా, లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ షూటింగ్ పార్ట్ని కంప్లీట్ చేయనున్నారు.
మరి.. రానా, సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: