రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే భద్రతా భాద్యతలను కట్టుదిట్టం చేసాయి. దీని దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుండగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇక ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇందులో భాగంగానే బాలకృష్ణ ఇప్పటికే తెలుగు సినిమా కార్మికుల కోసం 1 కోటి 25 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే అంతేకాకుండా.. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వాళ్లకు, హాస్పిటల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు, పారా మెడికల్ సిబ్బందికి పారా మెడికల్ సిబ్బందికి నందమూరి బాలకృష్ణ నిత్యవసరాలు అందజేసారు.
ఇక నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా బాలకృష్ణ స్పందించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో పని చేసే కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. హాస్పిటల్ లో పనిచేస్తున్న 400 మంది శానిటేషన్, హౌస్ కీపింగ్ కార్మికులకు నిత్యావసరాల కిట్లను అందించారు. దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు ప్రతి కుటుంబానికి సరిపోయేలా సరుకులను అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: