అనుష్కను అలా తీసుకున్నాం..!

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ముందుగా అనుష్క కాదట… తాప్సి అనుకున్నారట. రీసెంట్ గా ఇంటర్వ్యూ లో మాట్లాడిన హేమంత్ మధుకర్ ఈ విషయాన్ని తెలియచేశారు. నిజానికి ఈ సినిమాను చిన్న సినిమాగానే తీద్దామనుకున్నారట. అయితే ఒకరోజు కోనను కలువగా ఆయన కథ చాలా కొత్తగా.. బావుంది.. దీనిని ఇంటర్నేషనల్ స్థాయి లో తీయాలని చెప్పారు. ఆ తర్వాత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ముందు మాధవన్, తాప్సి అనుకున్నాం.. అయితే ఒకరోజు కోన గారు ఫోన్ చేసి ఈ సినిమలో అనుష్క అయితే ఎలా ఉంటుంది అని అడిగారు.. నాకు అప్పటికి ఆ ఆలోచన లేదు.. అప్పుడు నేను బావుంటుంది.. మరి తను ఒప్పుకుంటుందా అని అడిగా.. అప్పుడు కోన ఇప్పుడే ఫ్లైట్ లో కలిసాను.. కథ చెప్పను నచ్చింది అన్నది.. ఒకసారి మాట్లాడు అంటే అప్పుడు అనుష్క దగ్గరికి వెళ్లి అడిగితే తను వెంటనే ఒప్పుకుంది. అలా అనుష్క ఈ సినిమాలో భాగమైంది అని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.