లాక్ డౌన్ వల్ల థియేటర్స్ మొత్తం మూతపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ టైంలో కాస్త ప్రేక్షకులకు కాలక్షేపం అవుతుందంటే.. అది బుల్లి తెర… ‘ఓటీటీ’ ఫ్లాట్ ఫామ్స్ వల్లనే అని చెప్పొచ్చు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పుణ్యమా అని – ఈ లాక్ డౌన్ కాలంలో టైమ్ పాస్ అయిపోతోంది. ఇక ఈ లాక్ డౌన్ లో థియేటర్స్ సంగతి పక్కన పెడితే ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ మాత్రం పుంజుకున్నాయి. అంతే కాదు ఫ్యూచర్ లో కూడా ఈ ఫ్లాట్ ఫామ్స్ కే ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముందు ముందు చిన్న సినిమాలను ఈ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేసిన ఆశర్యపడనక్కర్లేదు. దీనితో మన టాలీవుడ్ నిర్మాతలకు పరిస్థితి ముందే అర్థమైనట్టు ఉంది. అందుకే ఒక్కొక్కరు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై దృష్టి పెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు మరో టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో త్వరలోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు. పలు వెబ్ సిరీస్ లు నిర్మించాలని..అంతే కాకుండా సినిమాలను కూడా తీయాలని చూస్తున్నాడట. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ నుండి పలు సినిమా రిలీజ్ కు సిద్ధంగా వున్నాయి. ‘నారప్ప’, ‘విరాట పర్వం’, ‘క్రష్’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో వున్నాయి.. ఇంకా మూడు సినిమాలు లైన్ లో వున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: