మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా రాయసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సునీల్ శెట్టి, బాబీ సింహా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుకుమార్ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు అని తెలిసిన విషయమే. వీరి కాంబినేషన్ లో రూపొందిన స్పెషల్ సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. ఇప్పుడు “పుష్ప” మూవీ లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉందని, ఈ స్పెషల్సాంగ్ కై బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. “లోఫర్” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దిశా పటాని తరువాత హిందీ మూవీస్ లో బిజీగా మారారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: