లాక్ డౌన్ కారణంగా ఎన్నో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలను కూడా ఆన్ లైన్ లోనే రిలీజ్ చేస్తారని ఇప్పటికే వార్తలు అందుకున్నాయి. ఇక ఈ వార్తలపై ఇప్పటికే పలు సినిమా దర్శక నిర్మాతలు స్పందించి అలాంటిది ఏం లేదు థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా తమ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాను కూడా ఒక ఓటీటీ ఛానల్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై విజయ్ కుమార్ స్పందించి.. అదేం లేదు… ఈ సినిమా తీయడానికి ఏడాది టైం పట్టింది.. రిలీజ్ కు ఇంకొన్ని రోజులు ఆగలేమా… మేము కూడా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తున్నాము.. లేట్ అయినా థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చాడు. ఇక తన తర్వాత సినిమా కన్నడ హీరో నిఖిల్ తో ఉంటుందని… ఈ లాక్ డౌన్ అయిపోయిన వెంటనే ఆ సినిమా షూట్ స్టార్ట్ అవుతుందని తెలిపాడు.
విజయ్కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరో, మాళవిక హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నఈ సినిమాలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: