కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన సహాయం అందిస్తున్నాయి. సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల దాక ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఎవరికి తోచిన సాయం చేస్తున్నారు. ఆకలితో బాధపడే వారికి ఆహారం అందిస్తూ.. ఆర్థికంగా చేయూత నిస్తూ కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా తెలుగు రాష్ట్రాలకు సాయం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్స్ కు రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు. కాగా ఇప్పటికే విజయ్ పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలతో పాటు తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చేరికి రూ.5 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలను విజయ్ విరాళాలుగా ప్రకటించారు. మొత్తంగా విజయ్ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఇప్పటికే సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ప్రారంభించిన ఈ కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ఇప్పటికే స్టార్స్ తో సహా పలువురు ప్రముఖులు కూడా విరాళాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని 24 శాఖల కార్మికుల్లోని పేదలకు సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ కూడా మన తెలుగు సినీ కార్మికుల కోసం సాయం చేసిన సంగతి తెలిసిందే.
మరి తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. కేవలం ఇక్కడ సినిమాలను రిలీజ్ చేసుకోవడమే కాకుండా మన తెలుగు వారి కోసం కూడా విరాళాలు ఇవ్వడం అభినందించాల్సిన విషయం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: