కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు, రోజువారీ కూలీలకు ఆర్థికంగా.. తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్న వారికి పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిలో భాగంగానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పును ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం అందించిన ఆయన.. జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్ , మాస్క్ లు పంపిణీ చేసారు. ఇప్పుడు తాజాగా తెలంగాణా పోలీసులకు శానిటైజర్స్ మరియు మాస్కులు పంపిణీ చేశారు. మెహిదీపట్నం రైతు బజార్ ఏరియాలో భారీ ఎత్తున ప్రొటెక్టీవ్ మాస్కులు, శానిటైజర్స్ స్వయంగా అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా పోలీసులు నిరంతరం రోడ్లపై విధి నిర్వహిస్తున్నారని.. అలాంటి వారి కోసం ఈ మాత్రం అయినా చేయాలని కోరారు.
కాగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా నాని హీరోగా ‘వి’ సినిమా తెరకెక్కించాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా అల్లు అర్జున్ హీరో గా ఐకాన్ సినిమాను కూడా తెరకెక్కించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: