‘అరవింద సమేత’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నాడని సమాచారం. అంతేకాదు.. శక్తిమంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో ఆయన దర్శనమిస్తాడని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ‘యన్టీఆర్ 30’లో సంజు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ఈ చిత్రంలో తారక్కు జోడిగా జాన్వీ కపూర్, పూజా హెగ్డే నాయికలుగా నటించే అవకాశం ఉందని.. అలాగే ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
మరి.. ‘అరవింద సమేత’ తరువాత తారక్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: