‘పుష్ప’ స్టోరీ లైన్ అదేనా?

Allu Arjun Starrer Pushpa Movie Based On This Interesting Storyline

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో కన్నడ కస్తూరి రష్మిక మందన్న నాయికగా నటిస్తోంది. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే మొదటిదశ చిత్రీకరణ పూర్తయింది. లాక్ డౌన్ అనంతరం రెండోదశ చిత్రీకరణని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ స్టోరీ లైన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే.. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన రష్మిక మందన్నను కొందరు దుండగులు హత్య చేస్తారట. ఈ నేపథ్యంలో ఆ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని రష్మిక భర్త, లారీ డ్రైవర్ అయిన అల్లు అర్జున్ ఎలా చేధించాడు? ఆ హంతకులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ఇన్‌సైడ్ టాక్. మరి.. ఈ క‌థ‌నాల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే ‘పుష్ప’ విడుద‌ల వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘పుష్ప’ని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.