కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ మూవీ షూటింగ్స్, ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉండే సినీ తారలు లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోవడంతో ఇళ్ళకే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తూ సెలబ్రిటీస్ స్టే హోమ్, స్టే సేఫ్ అంటూ సందేశాలు ఇస్తున్నారు. హీరో రవితేజ తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ క్వారంటైన్ సమయంలో ప్రతి రోజూ ఆదివారం లాగే ఉందంటూ సరదాగా కామెంట్ చేశారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “క్రాక్” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: