‘ఆర్య’, ‘ఆర్య2’ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఓ ప్రత్యేక గీతంలో మెరవనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ‘పుష్ప’లో కథానుసారం ఓ స్పెషల్ సాంగ్కి స్కోప్ ఉందట. ఇప్పటికే ఈ పాటకి సంబంధించి డీఎస్పీ ట్యూన్ కూడా సిధ్ధం చేసాడని టాక్. కాగా, ఈ సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలిచే ఈ పాట కోసం కియారాతో సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి. మరి, ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా.. ఫస్ట్ టైమ్ చేయనున్న ఈ స్పెషల్ సాంగ్తో ఏ మేరకు మురిపిస్తుందో చూడాలి. త్వరలోనే కియారా ఎంట్రీపై క్లారిటీ రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: