లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తున్నారు.. అయితే సోషల్ మీడియాద్వారా మాత్రం ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి సినిమాల గురించి.. ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు.. ఇలా పలు విషయాలు గురించి.. పలు ఆసక్తికరమైన విషయాల గురించి చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా… రానాను రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని కూడా చెప్పాడు. ఇక కరోనా వల్ల ‘అరణ్య’ సినిమా విడుదల వాయిదా పడగా..ఈ హడావుడి అంతా అయిపోయిన తర్వాత ‘అరణ్య’ కొత్త విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తామని చెప్పాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘అరణ్య’గా, తమిళంలో ‘కాడన్’గా, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా రూపొందుతుంది. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన దురదృష్టకర ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: