భారతీయ చిత్ర పరిశ్రమను టార్గెట్ చేస్తూ, దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించేలా 4 టాలీవుడ్ మూవీస్ రూపొందుతున్నాయి. బ్లాక్ బస్టర్ “బాహుబలి ” మూవీతో తెలుగు సినిమా సత్తా చాటిన దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెలుగు, తమిళ, హిందీ బాషలలో #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “సాహో ” మూవీ ఘనవిజయంతో#Prabhas 20 మూవీ పై ఉత్తరాది లో కూడా క్రేజ్ నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్) మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,రష్మిక జంటగా “పుష్ప ” మూవీ రూపొందుతుంది. తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. ఇలా నాలుగు మూవీస్ తో టాలీవుడ్ ఇండియా ను టార్గెట్ చేసింది. ఈ నాలుగు మూవీస్ తో మన టాలీవుడ్ హీరోలు దేశవ్యాప్తం గా విజయకేతనం ఎగరవేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: