పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘వకీల్ సాబ్’లో లాయర్ గా నటిస్తూనే.. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారాయన. ఈ రెండు చిత్రాలతో పాటు.. తన లక్కీ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లోనూ నటించేందుకు సిధ్ధపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ ఓ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ‘తడాఖా’, ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ వంటి రీమేక్ చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ పార్థసాని (డాలీ) ఓ మల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. ఇద్దరు కథానాయకులకు స్థానమున్న ఈ చిత్రంలో పవన్ ఒక హీరో కాగా, మరో హీరోగా మాస్ మహరాజా రవితేజ నటించే అవకాశముందని వినిపిస్తోంది. ఇప్పటికే డాలీ ఈ ఇద్దరు కథానాయకులను సంప్రదించి కథను వినిపించాడని.. వారు కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. మరి.. గతంలో ‘గోపాల గోపాల’ చిత్రం కోసం విక్టరీ వెంకటేష్, పవన్ను డైరెక్ట్ చేసి హిట్ కొట్టిన డాలీ.. పవన్, రవితేజ కాంబినేషన్ మూవీతోనూ ఆ పరంపరను కొనసాగిస్తాడేమో చూడాలి. త్వరలోనే పవర్ స్టార్ తో `పవర్` స్టార్ నటించబోయే మల్టీస్టారర్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే… ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’తోనూ, రమేష్ వర్మ డైరెక్టోరియల్ తోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: