కింగ్ నాగార్జున, కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి కలయికలో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. వాటిలో ‘నేనున్నాను’ ఒకటి. నాగార్జున, శ్రియ, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మ్యూజికల్ ఎంటర్టైనర్కి వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించాడు. ముకేష్ రుషి, సుబ్బరాజు, పశుపతి, బ్రహ్మానందం, సునీల్, అలీ, తనికెళ్ళ భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, ధర్మవరపు సుబ్రహ్మణం, సుధ, శివపార్వతి, రవిబాబు ముఖ్య పాత్రలు పోషించగా.. అనిత (‘నువ్వు నేను’ ఫేమ్) ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్ గీత రచన చేయగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. ఇందులోని అన్ని గీతాలూ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా.. “ఏ శ్వాసలో చేరితే” పాట అటు సంగీతం పరంగానూ, ఇటు సాహిత్యం పరంగానూ మెప్పించడమే కాకుండా.. సినిమా విజయంలోనూ కీలక పాత్ర వహించింది. అలాగే “చీకటితో వెలుగే చెప్పెను”, “నీ కోసం”, “ఎట్టాగో ఉన్నాది”, “రాలీ రావులపాడు”, “ఇంత దూరమొచ్చినాక”, “నూజివీడు”.. వంటి పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. 2004 ఏప్రిల్ 7న విడుదలై మంచి విజయం సాధించిన ‘నేనున్నాను’.. నేటితో 16 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: