అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేసిన సంగతి విదితమే. అయినా కూడా ఇప్పటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా బుల్లి తెరపై కూడా ప్రభంజనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సన్ నెట్ వర్క్ ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న జెమినీ టీవీ లో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏకంగా 23.4 టీఆర్పీ సాధించి ఆల్ టైం టాప్ లో నిలిచి రికార్డ్ సృష్టించింది. ఆశ్ఛర్యం ఏంటంటే ఏ సినిమాకు కూడా గత 15ఏళ్లలో ఇంత టీఆర్పీ రేటింగ్స్ రాలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ రకంగా మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరో ఆశ్ఛర్యకరమైన సంగతి ఏంటంటే.. దేశ వ్యాప్తంగా వందల కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ బాహుబలి 2 టీఆర్పీ కూడా 22.7 మాత్రమే. అలాంటిది మహేష్ సరిలేరు నీకెవ్వరు అంతకు మించిన టీఆర్పీ రేటింగ్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: