ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ‘రెడ్’తో బిజీగా ఉన్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్’కు రీమేక్గా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం… ఏప్రిల్ 9న విడుదల కావలసి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… రామ్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… గత ఏడాది ‘ప్రతిరోజు పండగే’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు మారుతి కాంబినేషన్ లో రామ్ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’… ఇలా వరుసగా యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తూ వస్తున్న రామ్… జస్ట్ ఫర్ ఎ చేంజ్ అన్నట్లుగా ఈ సారి మారుతి మార్క్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్లో నటించేందుకు సిధ్ధపడుతున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను నిర్మించనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే మరింత క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: